వేదిక మీద తోపులాట.. చేయి చేసుకున్న నేతలు

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదిక మీద కుర్చీలో కూర్చునే విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హనుమంతరావు, ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్‌ మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకొని.. కుర్చీలో కూర్చునేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీహెచ్‌, నగేశ్‌ వేదిక మీదే పరస్పరం బాహాబాహీకి దిగారు. పరస్పరం తోసుకుంటూ కింద పడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top