చిక్కుల్లో చిద్దూ! | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో చిద్దూ!

Published Thu, Aug 22 2019 7:52 AM

స్టార్‌ టీవీ ఇండియాకు సీఈఓగా దాదాపు పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత బయటకు వచ్చేసిన పీటర్‌ ముఖర్జియా సంస్థ పేరే ఐఎన్‌ఎక్స్‌ మీడియా. ఈయన తన భార్య ఇంద్రాణి ముఖర్జీతో కలిసి 2007లో ఐఎన్‌ఎక్స్‌ మీడియాను ఆరంభించారు. దాన్లో ఇంద్రాణి సీఈఓగా ఉండగా... పీటర్‌ ముఖర్జియా చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా చేరారు. ఈ సంస్థలోకి విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిన రూ.305 కోట్లకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) పచ్చజెండా ఊపింది.

Advertisement
Advertisement