తుపాకితో బెదిరించి దోచుకోవాలనుకున్న ఓ దొంగకు మతి పోయేలా చేసిందో మహిళ. తుపాకికి ఏ మాత్రం అదరకుండా.. బెదరకుండా అతడ్ని తరిమికొట్టింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోకు చెందిన ఓ మహిళ తన ఇంటిముందు నిలబడి ఉంది. ఇంతలో ఇద్దరు ముసుగు దొంగలు బైక్పై అక్కడకు చేరుకున్నారు. ఒక దొంగ బైక్పైనుంచి కిందకు దిగి ఆ మహిళను సమీపించాడు. మరో దొంగ అతడికోసం దూరంగా బైక్పై వేచిచూస్తున్నాడు. మహిళను సమీపించిన దొంగ తుపాకి బయటకు తీసి ఆమెను భయపెట్టాడు. ఒంటిమీది నగలు తీసివ్వకపోతే చంపుతానని బెదిరించాడు. ఇలాంటి సమయంలో మామూలు మనుషులైతే బిక్కచచ్చిపోయేవాళ్లే. కానీ ఆ మహిళ ఏ మాత్రం భయపడకుండా అతడిపై దాడికి దిగింది. ఈ ఊహించని పరిణామంతో అతడు బిత్తరపోయాడు. చేసేదేమీ లేక కాళ్లకు బుద్ధిచెప్పాడు.
చేతిలో తుపాకి ఉంది.. ఐతే ఏంటి?
Jun 5 2019 6:32 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement