పేలుళ్ల మోతతో దద్దరిల్లిన వరంగల్‌

వరంగల్‌కు చెందిన గుళ్లపెల్లి రాజ్‌కుమార్‌ అలియాస్‌ బాంబుల కుమార్‌ కాశి బుగ్గ సమీపంలో కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ పేరుతో టపాసుల విక్రయాలు చేస్తున్నాడు. ఈ గోదాములో సుమారు 60 మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 20 మంది గోదాములో ఉన్నట్లు సమాచారం. కాజీపేటకు చెందిన ఓ మహిళ మరణించడంతో ఆమె శవయాత్రలో బాణసంచా కాల్చేందుకు బందెల సారంగపాణి, బండారి సమ్మయ్య, రాజు, మహేశ్‌ ఉదయం 11 గంటల సమయంలో ఈ గోడౌన్‌ వద్దకు వచ్చారు. కంపెనీ ఔట్‌లెట్‌లో టపాసులు బేరం చేస్తున్నారు. ఇంతలో శక్తివంతమైన టపాసులు లోపలి నుంచి తెస్తానంటూ ఓ వర్కర్‌ తయారీ విభాగంలోకి వెళ్లాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top