పట్టిసీమపై బీజేపీ, టీడీపీ మాటల యుద్ధం | BJP MLA Vishnukumar Raju Hits Out At TDP Government In Assembly | Sakshi
Sakshi News home page

పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బీజేపీ, టీడీపీ మధ్య  మాటల యుద్ధం

Mar 21 2018 7:01 PM | Updated on Mar 22 2024 11:04 AM

ఏపీ శాసనసభలో బుధవారం పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బీజేపీ, టీడీపీ మధ్య  మాటల యుద్ధం జరిగింది. పట్టిసీమ ప్రాజెక్ట్‌పై బుధవారం సభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు...ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయన ఆరోపించారు. పట్టిసీమపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్‌ చేశారు. మొత్తం రూ.371 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగాయని, కాగ్‌ కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించిందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement