వైఎస్ జగన్‌తో సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌తో సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ

Published Tue, May 28 2019 10:43 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈనెల 30న జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి జగన్‌కు వీరు వివరించినట్టు సమాచారం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా వైఎస్‌ జగన్‌ను కలిశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement