‘వైఎస్సార్‌ నవోదయం’ ప్రారంభించిన సీఎం జగన్‌

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను ఆదుకునేందుకు ‘వైఎస్సార్‌ నవోదయం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి గురువారం సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top