నీదీ నాదీ ఒకే కథ’ టీజర్‌ విడుదల

 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. నిజజీవితానికి దగ్గరగా ఉన్న కథలు కొత్తదనంతో తెరకెక్కి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్‌ మదిలో వంటి సినిమాలు ఇదే కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ పొందాయి. తాజాగా ‘అప్పట్లో ఒకడు ఉండేవాడు’ ఫేమ్‌ శ్రీవిష్ణు ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణవిజయ్‌ నిర్మించిన ఈ సినిమాను నారా రోహిత్‌ సమర్పిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకకులను ఆకట్టుకుంటోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top