కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్రెడ్డి అని కృష్ణా జిల్లా పోలీసులు ధ్రువీకరించారు. డబ్బు కోసమే జయరాంను హింసించి చంపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాకేష్రెడ్డితో పాటు అతడికి సహకరించిన వాచ్మన్ శ్రీనివాస్ను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.