భారత క్రికెట్కు ఇది పండగ వేళ... సాంప్రదాయ ఆటను అభిమానించే వారికి ఇదో ఉద్వేగభరిత క్షణం. క్రికెట్ ప్రపంచం కొత్తదిగా మారిపోయినా, తరాల అంతరాలు ఉన్నా... ఎనిమిది పదుల వసంతాలుగా తెల్ల దుస్తుల క్రికెట్ను కాపాడుకుంటున్న అందరికీ ఇదో ఆనందకరమైన అనుభూతి. 1932లో ఎలాంటి హడావిడి లేకుండా మొదలైన భారత టెస్టు ప్రస్థానం ఇప్పుడు మరో మైలురాయిని చేరింది. టెస్టు చరిత్రలో 500 మ్యాచ్లు ఆడిన నాలుగో జట్టుగా టీమిండియా గుర్తింపు అందుకోనుంది. 285 మంది ఆటగాళ్లు, అందులో 32 మంది కెప్టెన్లు... ఎన్నో రికార్డులు, మరెన్నో ఘనతలు భారత టెస్టు క్రికెట్ను సుసంపన్నం చేశాయి.