ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఘనస్వాగతం లభించింది. వంశాధార ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలిచేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతంతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసిరెడ్డి వరద రామారావు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వాసిరెడ్డిని పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు.
May 19 2017 12:49 PM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement