‘తెలంగాణ సాధన సభ’ ప్రారంభం | | Sakshi
Sakshi News home page

Jun 30 2013 4:44 PM | Updated on Mar 22 2024 11:25 AM

తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న‘తెలంగాణ సాధన సభ’ ప్రారంభమయింది. నిజాం కళాశాల మైదానంలో ఈ మధ్యాహ్నం ప్రారంభమయిన ఈ బహిరంగ సభకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు, జనం తరలివచ్చారు. తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్సేనన్న సంకేతాలు పంపడంతోపాటు ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారన్న భావనను అధిష్టానానికి కలిగించేందుకు టి. కాంగ్రెస్ నేతలు ఈ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సభకు తరలివచ్చారు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ సభకు హాజరు కాలేదు. తెలంగాణ అమర వీరులకు సభ నివాళులర్పించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement