మంత్రి జానారెడ్డిపై మరోసారి హైకోర్టులో పిటిషన్ | | Sakshi
Sakshi News home page

Jun 28 2013 5:28 PM | Updated on Mar 21 2024 8:47 PM

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డిపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జానారెడ్డి ఆస్తులపై సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో దర్యాప్తు చేయించాలంటూ వీవీరావు అనే సామాజిక కార్యకర్త ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో వీవీరావు వేసిన ఇదే పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అయితే మరి కొన్ని మార్పులతో జానారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ఆయన మళ్లీ పిటిషన్ వేశారు. జానారెడ్డికి విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయని,వాటిలో విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘన జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement