ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు | The entrance exam scheduled | Sakshi
Sakshi News home page

Feb 18 2017 7:07 AM | Updated on Mar 22 2024 11:30 AM

రాష్ట్రంలో ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో (కంప్యూటర్‌ ఆధారితంగా) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ జి.విజయరాజు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ పి.నరసింహారావు, సెట్ల ప్రత్యేకాధికారి డాక్టర్‌ కె.రఘునాథ్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంసెట్‌ సహా అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఖరారు చేశామని, కొన్నిటి నోటిఫికేషన్లు విడుదల య్యాయన్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement