'ఆ గలీజు పని ప్రజల మీద రుద్దే ప్రయత్నమా?' | Sakshi
Sakshi News home page

'ఆ గలీజు పని ప్రజల మీద రుద్దే ప్రయత్నమా?'

Published Sat, Jun 27 2015 12:14 PM

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అయిదు కోట్ల ఏపీ ప్రజల కోసం కాకుండా, రూ.5 కోట్ల కుంభకోణం నుంచి బయటపడటానికి పని చేస్తున్నారని ఆయన చురకలు వేశారు. కేటీఆర్ శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన నిధులపై జైట్లీతో చర్చించామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement