స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం | SBI writes off Rs 7,016 crore loans owed by wilful defaulters | Sakshi
Sakshi News home page

Nov 16 2016 3:08 PM | Updated on Mar 22 2024 11:05 AM

దేశ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో ఉన్న రుణ బకాయిలను వేరే ఖాతాలోకి మళ్లించి... తన బ్యాలెన్సు షీటులో మొండి బకాయిల భారం లేకుండా చూసుకుంది. ఇందుకోసం రిజర్వు బ్యాంకు అనుమతించిన పద్ధతి అయిన 'అడ్వాన్స్‌ అండర్ కలెక్షన్ అకౌంట్స్ (ఆకా)' అనే పద్ధతిని అవలంబించింది. దీని ప్రకారం మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులను ఒక ప్రత్యేకమైన అకౌంటులోకి బదిలీ చేస్తారు. తద్వారా ముందుగా అవి బ్యాంకు బ్యాలెన్సు షీటులో కనిపించవు. తద్వారా బ్యాంకు పనితీరు మెరుగుపడినట్లు అవుతుంది. కానీ, అంతమాత్రాన వాటిని పూర్తిగా మాఫీ చేసినట్లు కాదు. వన్‌టైమ్ సెటిల్మెంట్లు తప్ప మిగిలిన బకాయిలన్నింటినీ సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు చూపించినా, వాటిని 'ఆకా'లో యథాతథంగా ఉంచుతారు. అంటే, చిట్టచివరి రూపాయి వసూలయ్యే వరకు వాటి రికవరీ విధానం కొనసాగుతూనే ఉంటుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement