తెలంగాణకు రూ.1,800 కోట్ల కరెన్సీ | rbi sends 1800 crores to telangana | Sakshi
Sakshi News home page

Dec 3 2016 9:51 AM | Updated on Mar 21 2024 6:13 PM

నగదు కొరత తీవ్రమవటంతో రిజర్వు బ్యాంకు తెలంగాణకు రూ.1,800 కోట్ల విలువైన నోట్లు పంపిణీ చేసింది. కానీ చిన్న నోట్లు ఇవ్వాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆర్‌బీఐ పట్టించుకోలేదు. మొత్తం రూ.2వేల నోట్లనే పంపించింది. దీంతో రాష్ట్రంలో చిన్ననోట్ల కొరత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్‌బీఐ పంపిణీ చేసిన నోట్లన్నీ గ్రామీణ ప్రాంతాలకే చేరేలా చూడాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న కొరతను తీర్చేందుకు కనీసం రూ.5,000 కోట్ల విలువైన నోట్లను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల కిందటే ఆర్‌బీఐకి లేఖ రాసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement