పఠాన్కోట్లో ఆర్మీ అధికారులు మంగళవారం హై అలర్ట్ ప్రకటించారు. నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు సమాచారం అందటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అనుమానితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా పంజాబ్ సరిహద్దు వద్ద మంగళవారం ఆర్మీ దుస్తులను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు