నియంత్రణ రేఖ వెంబడి భారత్ చేసిన దాడులతో మొత్తం ఆసియా ప్రాంతం భద్రతకే ప్రమాదం వాటిల్లిందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. భారత్ సర్జికల్ దాడి నేపథ్యంలో ఇస్లామాబాద్లో అత్యవసరంగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేసిన షరీఫ్.. దేశంలో, సరిహద్దు వద్ద భద్రత, తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భారత్ దాడులను తిప్పికొట్టే సత్తా పాక్కు ఉందన్నారు. పాక్ శాంతిని కోరుకుంటుందని అయితే ఎల్వోసీ వద్ద భారత్ దూకుడు చర్యలకు దిగితే.. తన ప్రజలను కాపాడుకునేందుకు పాక్ ఎంతకైనా తెగిస్తుందన్నారు. తమ బృందాలు కూడా సమర్థవంతంగా సర్జికల్ దాడులను నిర్వహించగలవని.. పాక్ ఆర్మీకి దేశమంతా మద్దతుగా ఉందన్నారు. సీమాంతర దాడులను భారత ప్రభుత్వం, మీడియా సర్జికల్ దాడులుగా గొప్పలు చెప్పుకుంటోందని.. అలాంటి దాడులేమీ జరగలేదని షరీఫ్ పునరుద్ఘాటించారు.
Oct 1 2016 6:57 AM | Updated on Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement