అమెరికాలో ఒక పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దాంతో ఓరోవిల్లె పరిసర ప్రాంతాలను అధికారులు అత్యవసరంగా ఖాళీ చేయిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఎన్నారైలు ఉంటారు. మొత్తం జనాభాలో 13 శాతం మంది పంజాబీలు, సిక్కులేనని తెలుస్తోంది. ఓరోవిల్లె డ్యాం ఎమర్జెన్సీ స్పిల్వే వద్ద ఒక రంధ్రం కనిపించడంతో ఏ క్షణంలోనైనా డ్యాం బద్దలయ్యే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఈ ప్రాంతమంతా కొట్టుకుపోతుందని అంటున్నారు. రంధ్రాన్ని మూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందువల్ల దిగువ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు వెంటనే ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. ఓరోవిల్లె డ్యాం ఆగ్జిలరీ స్పిల్వేకు రంధ్రం పడిందని, దానివల్ల ఓరోవిల్లె చెరువు నుంచి భారీ మొత్తంలో వరద నీరు ముంచెత్తొచ్చని జాతీయ వాతావరణ శాఖ తొలుత తెలిపింది.