వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ ఆచారానికి చరమగీతం పాడేందుకు ముస్లిం సామాజికవర్గం సరైన పరిష్కారాన్ని కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. బస్వ పర్వదినం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ‘ ఈ దురాచారం నుంచి ముస్లిం మహిళలను కాపాడేందుకు ఆ సామాజిక వర్గం ప్రజలు ముందుకువస్తారని నేను నమ్ముతున్నాను’ అని తెలిపారు. దేశంలో ఎలాంటి వివక్షకు తావులేదని, ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ అన్నదే ప్రభుత్వ సిద్ధాంతమని, ప్రజల పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని చెప్పారు.