అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Published Thu, Sep 3 2015 9:55 AM

ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును.. సైకో పార్టీ'గా పెట్టుకోవాలంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై సభలో గందరగోళం నెలకొంది. మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలో పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతకు ముందు వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతి నిరాకరించటంతో వైఎస్ఆర్ సీపీ నిరసన తెలపటంతో 15 నిమిషాల పాటు సమావేశాలు వాయిదా పడ్డాయి.

Advertisement
Advertisement