‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ.. మానవత్వం ఉన్నవాడు..’ సమాజంలో రానురాను కరువవుతున్న మానవత్వం చిరునామాను వెతుకుతూ ఓ కవి హృదయం పడ్డ ఆవేదన ఇదీ! దీనికి అద్దంపట్టే ఘటన తాజాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో జరిగింది. జడ్చర్లలో నిమ్మబాయిగడ్డకు చెందిన శ్రీను (35) రోడ్డు దాటుతుండగా ఎరుపు రంగు చవర్లేట్ కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఒక్క ఉదుటున శ్రీను కారుపై భాగంలో ఎగిరిపడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయినా కారును కనీసం ఆపకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. కారుపై మృతదేహంతోనే సుమారు కిలోమీటరున్నర దూరం వెళ్లాడు.
Sep 20 2016 10:11 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement