టీడీపీలో మాత్రం చేరవద్దు అన్నారు | Sakshi
Sakshi News home page

టీడీపీలో మాత్రం చేరవద్దు అన్నారు

Published Sun, Jan 29 2017 6:35 PM

ఏ పార్టీలో అయినా చేరుకానీ, టీడీపీలో మాత్రం చేరవద్దని తన తండ్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు చెప్పారని కోటగిరి శ్రీధర్ అన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్తో తన తండ్రికి మంచి సంబంధాలున్నాయని, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చేరాలని ఆయన సలహా ఇచ్చారని చెప్పారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ సమక్షంలో కోటగిరి శ్రీధర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.