వేతన బకాయిల కోసం టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం ఎదుట కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఏడాది కాలంగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ట్రావెల్స్ సిబ్బంది ధర్నా చేపట్టారు. వేతన బకాయిలు చెల్లించకుండా, హఠాత్తుగా ట్రావెల్స్ మూసివేశామంటూ తమ ఉద్యోగాలను తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాము ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా ట్రావెల్స్ ను రాత్రికిరాత్రే మూసివేసి తమను రోడ్డు పాలు చేశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రావెల్స్ సిబ్బంది ఆందోళన సందర్భంగా ఎంపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ అందుబాటులో లేరని, ఆయన విజయవాడ రాగానే సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతామని కార్యాలయ సిబ్బంది చెప్పారు.
కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ధర్నా
Published Mon, Apr 17 2017 7:34 PM
Advertisement
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement