దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేసీఆర్ వైఖరితో రాష్ట్రం బాధతో ఘోషిస్తోందని ఆపార్టీ విమర్శించింది. బాబు, కిరణ్, కేసీఆర్లు ఇరుప్రాంత హీరోలుగా మిగిలిపోవడం కోసం జగన్పై విషప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. టీఆర్ఎస్ పెత్తనాన్ని 10 జిల్లాలకు పెంచడం కోసం కేసీఆర్ ప్రజల్లో వైషమ్యాలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ప్రజల్లో ఉనికి ఉండదనే భయంతోనే కేసీఆర్ పావులు కదుపుతున్నారని గట్టు విమర్శించారు. సకల జన భేరీలో కేసీఆర్ భావ దారిద్ర్యాన్ని ప్రదర్శించారని గట్టు ధ్వజమెత్తారు.
Sep 30 2013 3:29 PM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement