దేశంలో మోస్ట్ పాపులర్ సీఎంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మరోసారి ఎంపికైనట్లు ప్రముఖ సర్వే నిర్వహణ సంస్థ వీడీపీ అసోసియేట్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ప్రజాదరణపై చేసిన సర్వే ఫలితాలను శుక్రవారం ఈ సంస్థ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రజాదరణ విషయంలో నిర్వహించిన సర్వేలో 87 శాతం రేటింగ్తో సీఎం కేసీఆర్ మళ్లీ ఆగ్రస్థానంలో నిలిచారని పేర్కొంది.