ఈసీఐఎల్‌ ఉద్యోగిగా వీఆర్‌ఎస్ తీసుకుని... | Sakshi
Sakshi News home page

ఈసీఐఎల్‌ ఉద్యోగిగా వీఆర్‌ఎస్ తీసుకుని...

Published Thu, Dec 8 2016 7:40 AM

భారీగా ఆస్తులున్నట్టు చూపించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బాణాపురం లక్ష్మణ్‌రావు నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు వరుసగా రెండో రోజూ సోదాలు కొనసాగించారు. ఫిల్మ్‌ నగర్‌ లోని ఆయన ఇంట్లో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఏడు గంటలపాటు సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు కూడా తనిఖీలు కొనసాగాయి. లక్ష్మణ్‌రావు కుటుంబ సభ్యులను కూడా ఐటీ అధికారులు విచారించారు. ఈసీఐఎల్‌ ఉద్యోగిగా వీఆర్‌ఎస్ తీసుకుని 2008 నుంచి ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement