పాకిస్థాన్లోని క్వెట్టా నగరంలో పోలీసు శిక్షణ శిబిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ దాడిలో 60 మంది మరణించగా, 120 మంది గాయపడ్డారు. ఆత్మాహుతిదాడిలో ముగ్గురు పాల్గొన్నట్లు ఇస్లామిక్ స్టేట్ తరచు తన ప్రకటనల కోసం ఉపయోగించే అమాఖ్ వార్తాసంస్థ తెలిపింది. ఐసిస్లోని ఖొరసాన్ బృందం మిషన్ గన్లు, గ్రెనేడ్లు ఉపయోగించడంతో పాటు, తర్వాత తమ నడుముకు కట్టుకున్న బాంబులను పేల్చేసినట్లు వివరించింది. ఈ దాడిలో పాల్గొన్నట్లుగా ఐసిస్ చెబుతున్న ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోను కూడా అమాఖ్ వార్తా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Oct 26 2016 6:32 AM | Updated on Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement