ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు అంత్యక్రియలు కుటుంబసభ్యులు, ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలోని సొంత వ్యవసాయక్షేత్రం పద్మా గార్డెన్స్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు... తండ్రి చితికి నిప్పంటించారు. అంతకు ముందు ఫిల్మ్చాంబర్ నుంచి దాసరి అంతిమ యాత్ర జరిగింది. దాసరిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా నాలుగేళ్ల క్రితం ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలు సైతం ఇక్కడే నిర్వహించారు.
May 31 2017 3:40 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement