ఐస్‌క్రీమ్‌, చీరల్ని కాదు.. 'మిర్చి' అమ్మండి | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌, చీరల్ని కాదు.. 'మిర్చి' అమ్మండి

Published Tue, Apr 25 2017 7:39 PM

ఏసీ రూముల్లో ఐస్‌క్రీమ్‌లు, చీరలు అమ్మినట్లే రైతులు ఏడాది కష్టపడి పండించిన మిర్చి పంటను అమ్మించాలని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఐస్‌క్రీమ్‌ను నిమిషాల్లోనే అమ్మి 7లక్షలు సంపాదించాడని, ఏడాది కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ఐస్‌క్రీమ్‌లు అమ్మి, సీఎం కూతురు కవిత చీరలు అమ్మి నిమిషాల మీదనే లక్షలు సంపాదిస్తున్నారని అన్నారు.