డ్రగ్స్‌ వ్యవహారంలో కొత్త మలుపు | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ వ్యవహారంలో కొత్త మలుపు

Published Mon, Jul 17 2017 6:24 AM

డ్రగ్స్‌ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. సినీరంగంతోపాటు రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ‘మత్తు’లో మునుగుతున్నారన్న కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్‌ వ్యాపారి కెల్విన్‌ సిట్‌ విచారణలో ఈ మేరకు కీలక విషయాలను బయటపెట్టినట్టు తెలిసింది. ‘‘మీరు (సిట్‌ అధికారులను ఉద్దేశించి) ఎల్‌ఎస్‌డీ బ్యాచ్‌ను మాత్రమే పట్టుకున్నారు. ఇంకా కొకైన్‌ బ్యాచ్‌ కూడా ఉంది. అందులో సినిమా, రాజకీయరంగానికి చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నారు’’అని అతడు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.