ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలను వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం తీవ్రంగా ఖండిచింది. ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, తాము ఏ విచారణకైనా తమ కుటుంబం సిద్ధమని శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి, కోడలు నాగిని రెడ్డి, కుమార్తె శిల్పా తెలిపారు.