సిమెంట్ కంపెనీలకు మంత్రి హెచ్చరిక | cabinet-sub-committee-meeting-with-cement-industry-executives | Sakshi
Sakshi News home page

Feb 6 2015 4:11 PM | Updated on Mar 22 2024 11:05 AM

పెంచిన సిమెంట్ ధరలు వెంటనే తగ్గించండి ... లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వెనక్కి తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి సిమెంట్ కంపెనీ పారిశ్రామికవేత్తలను హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లో సిమెంట్ కంపెనీ పారిశ్రామికవేత్తలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్బంగా పల్లె రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ... పాత రేట్ల ప్రకారమే సిమెంట్ బస్తాలను విక్రయించాలన్నారు. ముడి సరకులు ధరలు తగ్గుతున్నప్పటికీ సిమెంట్ బస్తాల రేట్లు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 4, 5 రోజుల్లో పెంచిన ధరలు తగ్గించాలి.. లేకుంటే చర్యలు తప్పవని పారిశ్రామికవేత్తలకు పల్లె రఘునాథ్రెడ్డి సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement