పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8మంది సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం తెల్లవారుజామున స్టీల్ కంచం, గ్లాస్తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ను కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. బెడ్షీట్లతో తాడులా తయారు చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు.