ఓ పన్నెండేళ్ల బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బిహార్లోని జెహానాబాద్లో ఆదివారం చోటు చేసుకుంది. పాఠశాల భవనంలో ఒంటరిగా ఉన్న బాలికపై కాకోసెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ అజూ అహ్మద్తోపాటు అతుల్ రహ్మాన్, అబ్దుల్ బరీ, ఎం.డి.శాకౌత్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్ అధికారి పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఒంటరిగా ఉన్న బాలికను భవనంపైకి తీసికెళ్లి అక్కడ లైంగికదాడిచేశారని చెప్పారు. అక్కడ అచేతన స్థితిలో పడిఉన్న బాలికను అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధితురాలి తల్లి గమనించింది.
Jan 17 2017 12:28 PM | Updated on Mar 21 2024 8:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement