పాత నోట్ల మార్పిడికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో దేశ వ్యాప్తంగా భారీగా నల్లధనం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ అధికారుల దాడులు మరవక ముందే మరో రాజకీయ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలో భారీగా నల్లధనాన్ని అధికారులు గుర్తించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన పార్టీ ఖాతాలో పాటు ఆమె సోదరుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాలో రూ.కోట్లలో డబ్బు డిపాజిట్ అయ్యింది. దీంతో ఎన్నికలకు ముందు బీఎస్పీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది.