రాజోలి ప్రాజెక్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వం భూసేకరణ చేసింది. అందులో కొంత భూమికి అవార్డు పాస్ కూడా అయింది. అయితే శాసనమండలిలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాత్రం రాజోలి ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము ఎలాంటి భూసేకరణ చేయలేదని, అవార్డు కూడా పాస్ చేయలేదని పచ్చి అసత్యాలు పలికారు. కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు మాత్రం రాతపూర్వకంగా అవార్డు పాసైనట్లు సమాచార హక్కు చట్టం కింద మాకు ఆధారాలు ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వానికి రాజోళి నిర్మాణం చేయాలనే ఆలోచన ఎక్కడా లేదు.
– పి. రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ


