ఫిర్యాదు దారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీషెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అదనపు సోమవారం ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలతో అదనపు ఎస్పీ మాట్లాడి వారి ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీసు సిబ్బంది ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు


