చాపాడు మండల తహసీల్దార్‌ సరెండర్‌ | - | Sakshi
Sakshi News home page

చాపాడు మండల తహసీల్దార్‌ సరెండర్‌

Oct 3 2023 1:26 AM | Updated on Oct 3 2023 9:51 AM

తహాసీల్దార్‌ సుభానీ  - Sakshi

తహాసీల్దార్‌ సుభానీ

చాపాడు : చాపాడు మండల తహసీల్దార్‌ విధులు నిర్వహిస్తున్న జేఎస్‌ సుభానీని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని కుచ్చుపాప రెవెన్యూ పొలం పరిధిలోని సర్వే నంబర్‌ 33/1, 2లో 1.56 ఎకరాలు, సర్వే నంబర్‌ 34/4లో 0.81 ఎకరాలు, 34/5లో 0.82 ఎకరాల ప్రభుత్వ అసైన్‌మెంట్‌ భూమి నరహరిపురం గ్రామానికి చెందిన నందిమండలం జయరామిరెడ్డి పేరుతో ఉంది.

పైన పేర్కొన్న సర్వే నంబర్లలోని 3.19 ఎకరాల భూమిని ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఎలాంటి ఆధారాలు లేకుండా చింతకుంట చిన్న పుల్లారెడ్డి అనే వ్యక్తి వెబ్‌ ల్యాండ్‌లో మార్పు చేశారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు చేపట్టినవిచారణలో తహాసీల్దారు సుభానీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించటంతో జిల్లా కలెక్టర్‌ వేటు వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు చేశారు. ఈయన స్థానంలో ఇక్కడ డిప్యూటీ తహసీల్దారుగా ఉన్న యామినిని ఇన్‌చార్జి తహసీల్దారుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement