
డ్రగ్స్ నివారణపై అవగాహన
తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం వికాస్ ఫార్మసీ కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాలలో వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నీల మాట్లాడుతూ.. డ్రగ్స్ విషం కన్నా ప్రమాదమైనదని, యువత డ్రగ్స్కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. సమాజంలో ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా డ్రగ్స్ నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పెద్దింటి నవీన్కుమార్, అధ్యాపకులు డాక్టర్ స్వరూప, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ నటేష్, మహేష్, ప్రీతం కుమార్, సుజాత, భవాని, తులసి, ఫర్హిన్, విజయ్కుమార్ పాల్గొన్నారు.