డ్రగ్స్‌ నివారణపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నివారణపై అవగాహన

Jun 6 2025 12:54 AM | Updated on Jun 6 2025 7:36 AM

డ్రగ్స్‌ నివారణపై అవగాహన

డ్రగ్స్‌ నివారణపై అవగాహన

తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం వికాస్‌ ఫార్మసీ కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం యాంటీ డ్రగ్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాలలో వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీల మాట్లాడుతూ.. డ్రగ్స్‌ విషం కన్నా ప్రమాదమైనదని, యువత డ్రగ్స్‌కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. సమాజంలో ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా డ్రగ్స్‌ నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ పెద్దింటి నవీన్‌కుమార్‌, అధ్యాపకులు డాక్టర్‌ స్వరూప, డాక్టర్‌ నరసింహారావు, డాక్టర్‌ నటేష్‌, మహేష్‌, ప్రీతం కుమార్‌, సుజాత, భవాని, తులసి, ఫర్హిన్‌, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement