వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jun 22 2025 3:09 AM | Updated on Jun 22 2025 3:09 AM

వరంగల

వరంగల్‌

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఏటూరునాగారం

అభయారణ్యంలోని కొండేటివాగు

మేడారం–తాడ్వాయి మధ్యలో

ఇటీవల కనిపించిన

అడవి దున్న (ఫైల్‌)

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి అభయారణ్యాన్ని పర్యాటకులు చుట్టి వచ్చేందుకు అటవీశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌ఎస్‌ తాడ్వాయి వైల్డ్‌ లైఫ్‌ శాఖ ఆధ్వర్యంలో జంగిల్‌ సఫారీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులు సఫారీలో అడవులను వీక్షించేందుకు సైతం రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. త్వరలోనే జంగిల్‌ సఫారీ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.

17 కిలోమీటర్లు దారి..

అడవులను జంగిల్‌ సఫారీ ద్వారా సందర్శించేందుకు ఎస్‌ఎస్‌తాడ్వాయి హట్స్‌ సమీపం నుంచి కాటాపూర్‌ బీటీ రోడ్డు నుంచి అడవిలో 17 కిలోమీటర్ల వరకు దారి ఏర్పాటు చేశారు. దారి మధ్యలో సిమెంట్‌ కాజ్‌వేలు కూడా నిర్మించారు. అడవిలో పెద్దగుట్ట వరకు దారి ఏర్పాటు చేశారు. ఈదారి మార్గాన జంగిల్‌ సఫారీలో పర్యాటకులు పెద్దగుట్ట చుట్టి వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.

ప్రకృతిని ఆస్వాదించేలా..

హైదరాబాద్‌ పట్టణ ప్రాంతాల నుంచి బొగత, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు దట్టమైన అడవుల్లోని ప్రకృతికి ఫిదా అవుతారు. గతంలో ఎస్‌ఎస్‌ తాడ్వాయి హట్స్‌లో బస చేసిన పర్యాటకులు ట్రెక్కింగ్‌, జంగిల్‌ సఫారీ ద్వారా అడవులను చుట్టుముట్టి వచ్చేవారు. సుమారు ఐదేళ్ల క్రితం జంగిల్‌ సఫారీ మూలనపడింది. దీంతో అప్పటినుంచి పర్యాటకులు ఎస్‌ఎస్‌ తాడ్వాయిలోని అడవుల సందర్శన నిలిచిపోయింది.

పెరుగుతున్న పర్యాటకుల తాకిడి

రోజురోజుకూ పలు ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మళ్లీ జంగిల్‌ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడవి మార్గాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే జంగిల్‌ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తాడ్వాయి మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని ఆదిమానవుల సమాధులను పర్యాటకులు, యూనివర్సిటీ విద్యార్థులు సందర్శిస్తున్నారు. అడవుల సందర్శనతో పాటు సమాధులను వీక్షించేందుకు జంగిల్‌ సఫారీ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వా యి నుంచి మేడారం మీదుగా ఊరట్టం ఏటూరునాగారం మండలంలోని కొండాయి వెళ్లే దారిలో మూడు కిలోమీటర్ల దూరంలో కొండేటి వాగు వ్యూ పాయింట్‌ చాలా అద్భుతంగా ఉంది. ఈ పాయింట్‌ వరకు జంగిల్‌ సఫారీ ఏర్పాటు చేస్తే మేడారానికి వచ్చే భక్తులతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది.

రెండు నెలల్లో అందుబాటులోకి..

ఎస్‌ఎస్‌తాడ్వాయిలోని జంగిల్‌ సఫారీ 60 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తాడ్వాయి హట్స్‌ నుంచి 17 కిలోమీటర్లు పెద్దగుట్ట వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అన్ని హంగులతో అడవులను సందర్శించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.

– రమేశ్‌, ఎఫ్‌డీఓ, ఏటూరునాగారం

జంగిల్‌ సఫారీ కోసం అడవిలో వేసిన రోడ్డు

న్యూస్‌రీల్‌

తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో త్వరలో ‘జంగిల్‌ సఫారీ’ అడవుల్లో 17కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం

బోన్ల నడుమ జంతువుల్ని.. డెన్‌ మధ్యన పులిని.. గూళ్లలో పిచ్చుకల్ని.. నిలువ నీటి తొట్లలో తాంబేళ్లను..

అక్వేరియంలో చేపల్ని జూ పార్క్‌లో చూసి మురిసిపోతాం. అలాంటిది.. దట్టమైన అడవిలో పచ్చందాల నడుమ సఫారీలో ప్రయాణిస్తూ.. వేటాడే పులిని.. చెవులకింపైన పక్షుల కిలకిలారావాల్ని.. చెంగుచెంగున పరుగెత్తే లేడికూనల్ని చూస్తూ సెల్‌ఫోన్లలో బంధిస్తూ పర్యాటకులు మైమరచిపోయేలా.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా ఎస్‌ఎస్‌ తాడ్వాయి వైల్డ్‌లైఫ్‌ అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో హాయిగా విహరించేందుకు సాగుతున్న ‘జంగిల్‌ సఫారీ’ ఏర్పాట్లపై ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం. –ఎస్‌ఎస్‌తాడ్వాయి

ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు

ఉమ్మడి జిల్లా పర్యాటకానికి మరింత శోభ

వరంగల్‌1
1/3

వరంగల్‌

వరంగల్‌2
2/3

వరంగల్‌

వరంగల్‌3
3/3

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement