చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Jun 22 2025 3:09 AM | Updated on Jun 22 2025 3:09 AM

చట్టా

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

పర్వతగిరి: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వరంగల్‌ అడిషనల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ బి.వెంకటచంద్రప్రసన్న సూచించారు. ఈ మేరకు మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రిన్సిపాల్‌ పి.అపర్ణ ఆధ్వర్యంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరిచి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39 (ఏ) ప్రకారం ఉచిత న్యాయ సలహాల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. సదస్సులో చీఫ్‌ లీగల్‌ అడ్వైజర్‌ సురేశ్‌, పర్వతగిరి సీఐ బి.రాజగోపాల్‌, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వనమహోత్సవానికి

మొక్కలను సిద్ధం చేయాలి

నెక్కొండ: వర్షాలు కురవగానే చేపట్టనున్న 11వ విడత వనమహోత్సవానికి అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన ఆదేశించారు. నెక్కొండ, పనికర గ్రామాలను శనివారం ఆమె సందర్శించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం నెక్కొండ గ్రామపంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. ఆమె వెంట ఎంపీఓ దయాకర్‌, పంచాయతీ కార్యదర్శులు సదానందం, నరేశ్‌ ఉన్నారు.

పథకాలను

సద్వినియోగం చేసుకోవాలి

నర్సంపేట: ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. నర్సంపేట పట్టణం అంగడి బజారులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మున్సిపల్‌, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్‌వెండర్స్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్‌ సత్యశారద ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రకాల తిను బండారాలను రుచి చూశారు. నర్సంపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాలాయి శ్రీనివాస్‌, అడిషనల్‌ కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, నాయకులు పాల్గొన్నారు.

కుంటలో

పశువులకాపరి గల్లంతు

సంగెం: ప్రమాదవశాత్తు కుంటలో పడి పశువులకాపరి గల్లంతైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండలం రామారం గ్రామానికి చెందిన కొంగరి వెంకటయ్య (70) ఇరవై ఏళ్ల క్రితం మండలంలోని ఆశాలపల్లి గ్రామానికి వచ్చి పశువులను కాస్తున్నాడు. భార్య మల్లమ్మతో కలిసి ముగ్గురు కూతుళ్లు నాగలక్ష్మి, రేణుక, రజితను పెంచి పెళ్లి చేశాడు. గ్రామానికి చెందిన బొల్లబోయిన స్వామి గేదెలను మేపడానికి వెళ్లిన వెంకటయ్య గ్రామానికి చెందిన నల్లకుంటలో ప్రమాదవశాత్తుపడి గల్లంతయ్యాడు. కాగా, మొరం అక్రమ తవ్వకాలతో కుంటలో సుమారు 30 అడుగుల మేర గుంతలు ఏర్పడి నీటితో నిండాయి. జాలర్లు వలలతో ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. రెండు ట్రాక్టర్‌ మోటార్ల ద్వారా నీటిని తోడుతూ వెంకటయ్య ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎస్సై నరేశ్‌ తెలిపారు.

రైతుల ఖాతాల్లో

రూ.153.47 కోట్లు జమ

ఖిలా వరంగల్‌: రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమచేస్తోందని కలెక్టర్‌ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1,52,975 మంది రైతులకు రూ.153.47 కోట్ల పెట్టుబడి సాయం అందించిందని ఆమె తెలిపారు.

చట్టాలపై అవగాహన  కలిగి ఉండాలి1
1/2

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై అవగాహన  కలిగి ఉండాలి2
2/2

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement