ఆధునిక ప్రపంచానికి యోగా ఓ వరం | - | Sakshi
Sakshi News home page

ఆధునిక ప్రపంచానికి యోగా ఓ వరం

Jun 22 2025 3:09 AM | Updated on Jun 22 2025 3:09 AM

ఆధుని

ఆధునిక ప్రపంచానికి యోగా ఓ వరం

ఖిలా వరంగల్‌: ఆధునిక ప్రపంచానికి అందించిన మహాద్భుతమే యోగా అని, చారిత్రాత్మక ప్రదేశంలో యోగా చేయడం సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తుందని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. ఖిలా వరంగల్‌ మధ్యకోటలోని నాలుగు కీర్తితోరణాల మధ్య శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుష్‌, పురా వస్తుశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన కలెక్టర్‌ సత్యశారద, పద్మశ్రీ అవార్డు గ్రహీత సో మ్లానాయక్‌ జ్యోతి ప్రజ్వాలన చేసి యోగా ప్రారంభించారు. ఈసందర్భంగా 1,000 మంది సాధకులు, అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడు తూ తనువు, మనస్సు ఆత్మను ఏకం చేసే సా ధనమే యోగా అన్నారు. కార్యక్రమంలో కా ర్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, పోశాల పద్మ, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆయుష్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనసూయ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆయుష్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మైదం రాజు, డీపీఆర్‌ఓ అయూబ్‌ అలీ, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, సీపీఓ గోవిందరాజన్‌, డీబీసీడీఓ పుష్పలత, తహసీల్దార్లు బండి నాగేశ్వర్‌రావు, ఫణికుమార్‌, యోగా గురువు అమృతవల్లి, నోడల్‌ ఆఫీసర్‌ రాజేందర్‌, పురావస్తుశాఖ అధికారి కృష్ణారెడ్డి, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

– మరిన్ని ఫొటోలు 9లోu

ఆధునిక ప్రపంచానికి యోగా ఓ వరం1
1/1

ఆధునిక ప్రపంచానికి యోగా ఓ వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement