డయేరియా మరణాలు అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

డయేరియా మరణాలు అరికట్టాలి

Jun 22 2025 3:09 AM | Updated on Jun 22 2025 3:09 AM

డయేరియా మరణాలు అరికట్టాలి

డయేరియా మరణాలు అరికట్టాలి

న్యూశాయంపేట: డయేరియా మరణాలను అరికట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్టాప్‌ డయేరియా క్యాంపెయిన్‌ ఫోర్స్‌ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. డయేరియా నివారణకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున గ్రామాల్లో క్లోరినేషన్‌ చేయాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు ప్రకాశ్‌, కొంరయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజ య్‌కుమార్‌, ఎంహెచ్‌ఓ రాజేశ్‌, వర్ధన్నపేట మున్సి పల్‌ కమిషనర్‌ సుధీర్‌, డీడబ్ల్యూఓ రాజమణి, సుజన్‌తేజ, భవాని, అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పించాలి

ముందస్తుగా వరి నార్లు పోసుకునేందుకు రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి, పత్తి కొనుగోళ్లలో ఈ టోకెన్‌ సిస్టం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పత్తి, మిరప పంటల దిగుబడి, మార్కెటింగ్‌లో నాణ్యత పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంటమార్పిడి, కూరగాయల సాగు, కందులు ఇతర పంటలు వేసేందుకు శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పించాలని పేరొన్నారు. సమావేశంలో ఉద్యాన అధికారి అనసూయ, మార్కెటింగ్‌ అధికారి సురేఖ, సహకారశాఖ అధికారి నీరజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement