
ఆలయ వ్యవహారాలు ధర్మబద్ధంగా నిర్వహించాలి
హన్మకొండ కల్చరల్: ఆలయ వ్యవహారాలు ధర్మబద్ధంగా నిర్వహించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సూచించారు. వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఈఓ శేషుభారతి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం మండలి చైర్మన్గా, తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్కుమార్రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీశ్, మోత్కూరి మ యూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్రావు సభ్యులుగా, దేవాలయ ముఖ్చ అర్చకుడు పార్నంది నరసింహమూర్తి ఎక్స్–అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పరిశీలకులు అద్దంకి విజయ్కుమార్, మట్వాడ సీఐ గోపి, సిబ్బంది, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.