
డయేరియా మరణాలను అరికట్టాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: డయేరియా మరణాలను అరికట్టాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఫోర్స్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా నివారణకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున గ్రామాల్లో క్లోరినేషన్ చేయాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొంరయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజయ్కుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సుధీర్, డీడబ్ల్యూఓ రాజమణి, సుజన్తేజ, భవాని, అనిల్కుమార్ పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి
ముందస్తుగా వరి నార్లు పోసుకునేందుకు రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి, పత్తి కొనుగోళ్లలో ఈ టోకెన్ సిస్టం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పత్తి, మిరప పంటల దిగుబడి, మార్కెటింగ్లో నాణ్యత పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.