మంత్రి పొంగులేటి, సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

మంత్రి పొంగులేటి, సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌

Jun 19 2025 7:50 AM | Updated on Jun 19 2025 7:50 AM

మంత్ర

మంత్రి పొంగులేటి, సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌

హన్మకొండ అర్బన్‌: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీశ్‌ బుధవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. అలాగే, సచివాలయంలోని సీఎస్‌ చాంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కూడా మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.

కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌గా

రాజ్‌కుమార్‌ కొనసాగింపు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్ల డైరెక్టర్‌గా గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ ఎల్పీ రాజ్‌కుమార్‌ను మరో సంవత్సరంపాటు కొనసాగిస్తూ రిజిస్ట్రార్‌ రామచంద్రం బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజ్‌కుమార్‌ పదవీకాలం ముగియడతో మళ్లీ ఆయననే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి తన చాంబర్‌లో రిజిస్ట్రార్‌ రామచంద్రంతో కలిసి రాజ్‌కుమార్‌కు ఉత్తర్వులు అందజేశారు.

నేటి నుంచి

యథావిధిగా పలు రైళ్లు

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఇటీవల రద్దు చేయగా.. ఆ రైళ్లు గురువారం నుంచి యథావిధిగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. కాజీపేట సబ్‌డివిజన్‌ పరిధిలోని బెల్లంపల్లి–రెచ్ని రోడ్డులో చేపట్టిన రైల్వే బ్లాక్‌ కారణంగా పలు రైళ్లను కొన్ని రోజులు రద్దు చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి యశ్వంత్‌పూర్‌–గోరఖ్‌పూర్‌ (22534) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, పాట్నా–చర్లపల్లి (03253) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌, చర్లపల్లి–పాట్నా (07255) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లను యథావిఽధిగా నడుపనున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు.

మంత్రి పొంగులేటి,  సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌1
1/3

మంత్రి పొంగులేటి, సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌

మంత్రి పొంగులేటి,  సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌2
2/3

మంత్రి పొంగులేటి, సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌

మంత్రి పొంగులేటి,  సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌3
3/3

మంత్రి పొంగులేటి, సీఎస్‌ను కలిసిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement