
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం
ధర్మసాగర్: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రూ.25 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.3.50 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, రూ.27 లక్షల కుడా నిధులతో నిర్మించిన సీసీ డ్రైయిన్, రూ.20 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎంపీ కడియం కావ్యతో కలిసి బుధవారం ముప్పారం కేజీబీవీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని, బిల్లుల మంజూరులో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్హులకు కచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. డీఈఓ వాసంతి, డీఎంహెచ్ఓ అప్పయ్య, పీఆర్ డీఈ శ్రీనివాస్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి