ఉప్పల్‌లో చైన్‌స్నాచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌లో చైన్‌స్నాచింగ్‌

Jun 19 2025 7:50 AM | Updated on Jun 19 2025 7:50 AM

ఉప్పల్‌లో చైన్‌స్నాచింగ్‌

ఉప్పల్‌లో చైన్‌స్నాచింగ్‌

కమలాపూర్‌: ఇల్లు కిరాయికి కావాలంటూ వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు లాక్కెళ్లిన ఘటన ఉప్పల్‌లో మంగళవారం రాత్రి జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన సముద్రాల మల్లమ్మ (70) తన భర్తతో కలిసి స్థానిక బస్టాండ్‌ సమీపంలో నివసిస్తోంది. నాలుగు రోజుల నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి మల్లమ్మ ఇంటి చుట్టూ తిరుగుతూ ఇల్లు కిరాయికి కావాలని అడిగి, రూ.500 అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ నెల 17న రాత్రి సుమారు 9 గంటలకు వచ్చి ఇంటి సామాన్లు వస్తున్నాయంటూ నమ్మించాడు. రాత్రి 12 గంటలకు మల్లమ్మను మంచినీళ్లు కావాలని అడిగాడు. మంచినీళ్లు తెచ్చి ఇస్తున్న క్రమంలో ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణ తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీసీ షేక్‌సలీమా, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, అడిషనల్‌ క్రైం డీసీపీ బోనాల కిషన్‌, ఏసీపీ సదయ్య తదితరులు ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణతో కలిసి బుధవారం వేర్వేరుగా సందర్శించారు. బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు.

వృద్ధురాలి మెడలోని నాలుగు తులాల పుస్తెలతాడు అపహరణ

ఘటనా స్థలిని పరిశీలించిన డీసీపీ, పోలీసు ఉన్నతాధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement